తెలుగు రావటం అంటే ఏమిటి??
ఇది “తెలుగు ఎందుకునేర్చుకోవాలి??” అనే ప్రశ్నకు రెండవ భాగం. మెదటిదానికోసం ఇక్కడ నొక్కండి.నిన్నటి టపాలో ఒక్కరుకూడా నాకు సరిగా సమాధానం చెప్పలేదు, కొత్తపాళిగారు పుస్తకాలు దొరికే చేటు మాత్రం చెప్పి (నా ఖర్మానికి నన్ను వదిలేశారు) ఆగారు. ఇక వల్లురిగారు తెలుగు నేర్చుకోవటానికి మానసిక/సామాజిక కారణాలు చెప్పారు( సబబే) ఇక కామేశ్వరరావు గారు మెదటకొద్దిగా మెట్టినా తరువాత మంచి ప్రశ్నలు వేశారు. ఇంతవరకు బానే ఉంది.
ఇక పోతే… తెలుగు రావటం అంటే ఏమిటి?? అనే ప్రశ్న వచ్చింది. ఇంత చిన్నగా అడిగితే ప్రశ్న అర్ధంకాదు వివరిస్తాను చూడండి..
తెలుగులో మాట్లాడటం రావటమా(వాడుక భాష)? అంటే భందుమిత్రులతోబాటుతెలుగువారితో మాట్లాడ గలిగేంత రావటం తెలుగు నుడికారపు మెదటి సందువరకు వచ్చి ఆగిపోతారు ఈ తరహా వాళ్ళు.
లేక
తెలుగు చదవటం రాయటం మెదలుగునవి రావటమా …?? వీరికి మాట్లాడటంతో కలిపి,పేపర్లు చదవటం, బస్సుల పేర్లు,సినిమా పోష్టర్ల పేర్లు చదవటానికి,తల్లి దంద్రులకు బందువలకు లేఖలు లేక వేగులు రాయటానికి సరిపడా వస్తుంది(సంసృతాంద్రము అంతగారాదు పరిసరాల బట్టి కొద్ది కొద్దిగా వస్తుంది.)
లేక
తెలుగు సాహిత్యం అంటే మక్కువ,తెలుగు కవితలు బాణీలు, కధలు వగయిరా వగయిరా…. ? వీరికి తెలుగు పుస్తకాలు చదవాలన్ని ఆశక్తి,తెలుగు సాహిత్యంలో ఉన్న పాతకొత్తవింత దోరణులు స్పృసించగల సత్త మరియు అలాంటి తపన ఉంటుంది…కొంత మంది ఒక అదుగు ముందుకేసి హైకులు,కవితలు,కవితలు లాంటివి రాస్తూ కొద్దిగా సాహితీ అభిమానం చూపిస్తుంటారు.
లేక
శ్రీశ్రీశ్రీ పండితారద్యుల పాపయ్య శాస్త్రీ , సహస్రఘనాపాటి అన్నా రేంజిలో ఉండాలా ?? వీరు తెలుగుసాహితీ సంఘంలో ఒకపట్టాన దిట్టలు ( మన కొత్తపాళీ గారు, తాడేపల్లిగారు ,రానారే గారు, కస్తూరిగారు… ఇంకా ఇలాంటీ సాహితీసముద్రపుత్రులు (మీ పేరు లేదు అంటే నేను ఇంకామిమ్మల్ని చూచి ఉండలేదు అని …నా లిష్ట ISO వారిదికాదు కనుక కోపగించకండి…క్షంతవ్యుడను) వృత్తి ప్రవృత్తి ఒకటిగా … అదీ తెలుగుగా కలిగినవారుకూడా వస్తారు….
మరి చెప్పండి ఇప్పుడు,ఏంటి అస్సలు తెలుగు రావటం అంటే??
ఓరి బుడతడా..!!! మరి నువ్వు ఏకోవకు వస్తావు అని అడగాలి అనుకుంటున్నారా…. అంతో కొంత చివరినుంచో రెండోరకం తరగతిలోకి వచ్చాను మొన్నీమద్య…. అదీ మరి… ఇప్పుడు చెప్పండి… తెలుగు రావటం అంటే ఏమిటి…??
మద్యతరగతి అని ఒక తరగతి ఉంటుంది,వారికి తెలిసిందే లోకం వారికి తెలిసిందే న్యాయం,చెబితేకోపం చెప్పకపోయినకోపం,వారికి తెలిసిందే సాహిత్యం,మళ్ళ ఎమన్న అందామన్నా చిక్కే…. వీరు సాహిత్యంలో హిట్లర్ రకం అన్నమాట అంటే తెలివయిన వారుకాని మూర్ఖోన్ముఖులు వీరలా రావటం కూడా తెలుగు రావటం…. ఇలా అవ్వలా ???
సదరు పెద్దలు… సమాదనాలు ఇస్తారు అని ఆశిస్తూ….
గమనిక: ఇప్పుడు ఉన్న పరిస్థితి బేరీజు వేస్తూ కాక,చూచాయిగా తెలుగు రావటం అంటే ఏమిటిమాత్రమే చెబుతారు అని ఆశిస్తున్నాను…
కావలసినన్ని మొట్టికాయలు మొట్టినా…చివరలో సమాధానం రాయటం మాత్రం మరువకండే…. అంటే… తెలిసిన వాళ్ళు తెలియని వారలకు చెప్పాలికదా కనీసం నోరితెరిచి అడిగినప్పుడు( సెంటిమెంట్)…
ఇప్పటివరకు 15 వ్యాఖ్యలు
Leave a reply
this is just for kidding….Do not take it seriously..OK?
‘గమనిక: ఇప్పుడు ఉన్న “పరిస్తితి” తో బేరీజు వేస్తూ కాక,చూచాయిగా తెలుగు రావటం అంటే “ఎమిటి” మాత్రమే చెబుతారు అని ఆశిస్తున్నాను…’
పై సెంటెన్స్ లో ఉన్న తప్పులు దిద్దుకుని తెలుగు వ్రాయగలిగితే మీకు తెలుగు ‘వచ్చినట్టే’
అమ్మ ముసల్ది అయిపోయిందని..కొత్త అమ్మ గురించి ఆలోచిస్తున్నట్టుంది..మీ ధోరణి చూస్తే…
మాతృభాషలో మాట్లాడటానికి..నేర్చుకోవటానికి ఇంత చర్చ అవసరమా..
నెనెర్లు… చాలా హడావిడిగా రాస్తున్నప్పుడుదొర్లినతప్పు అండి శర్మగారు…
కాని మీరు సమాధానం చెప్పలేదు మరి ? మీకు శ్రమ లేకుండా తరగతి కూడ పెట్టనుకదా కనీసం అది అని రాయకూడదు…. ఏమంటారు ?
అయ్యో నాకురాదనికాదు… నేను నేర్చుకోను/నేర్పమని చెప్పను అనేది కాదండి….
మీరు చెప్పింది….బానే ఉందికాని, నా భాద ముసలిది అయిపోయిన అమ్మ అని కాదు…అస్సలు మా అమ్మముసలిదయినా అమ్మలానే ఎలా ఉంచాలి,ఎప్పటికీ…. ముసలి అమ్మ… గతించిన అమ్మ అని… భౌతికత ఈ భాషకురాకుండా ఉండాలి అని నాకోరిక తపన వగయిర వగయిర….. మీకు నేను రాసిన విదానం నచ్చకనో మరి మీరు కూడా సమాధానం చెప్పలేదు…
అయినా…. నేర్చుకునే వాడిని ఆపలేము,నేర్చుకోను అన్నవాడిని మార్చలేము…నాకు నేర్చుకోవలని ఉంది కాని….ఆ సమయం దీనిమీద పెడితే నాకు వచ్చేది ఎమన్నా ఉందా అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు బహుసా వాళ్ళ వాదన సబబే( ఈ కాలం ప్రకారం) కనుక వాళ్ళకు చూపించటానికి మీరు పెద్దలు కదా అని అడుగుతుంటే..అందరూ ఇలా మెట్టికాయలు వేస్తున్నరుకాని గట్టిసమాధానం ఒక్కరూ చెప్పరేంటీ చెప్మ…..!!!
సుబ్బారావుగారు….(ఇది చదివినవారుకూడానూ….)
నా ప్రశ్న మీరుచెప్పినట్లూకాక ఇలా ఉంటుంది….
మా అమ్మ నాన్న నాకు గొప్ప మరి పక్కింటీ పాపరావుకో…??? పక్కదేశం పరమేశం గారికో??
సమాధానం:
వారి సంస్కారముని బట్టీ ఉంటుందా లేక నా తలి దండ్రుల అర్దిక సామాజిక రాజకీయ పరిమితి బట్టి ఉంటుందా ???
అక్కడ గొప్ప అనే పదాన్ని… హబుల్ టెలీ స్కోప్ లో పెట్టి చూసిమరీ చెప్పాలి….సమాదానం….
దీనికి సమాధానం చెబితే… నాకు సమాధానం దొరికినట్టే…ఒకింత…..
చంద్ర మౌళీ,
మీరు అద్దంకిలో పుట్టి పెరిగి, ఆసాంతం చదువు అక్కడే వెలగబెట్టి(మీ భాషలో) తెలుగెందుకు నేర్చుకోవాలని ప్రశ్నిస్తుంటే ఏమని చెప్పగలను. తెలుగు వాళ్లకైతే మాత్రు భాష తల్లితో సమానం కాబట్టి నేర్చుకోవాలి. అది నీది. నీ రక్తం, నీ సంస్క్రుతి, నీ జీవితంలో భాగం కాబట్టి! ప్రపంచంలో ఉత్తమ సాహిత్యం అంతా ఇతర భాషల్లోనే ఉందని భ్రమ పడటం మన దౌర్భాగ్యం! వాళ్ళలా మనం మార్కెట్ చేసుకోలేకపోయాం కాబట్టి మన సాహిత్యం ప్రాంతీయ స్థాయిలో మిగిలిపోయింది.
ఇతర భాషల వాళ్ళు తెలుగు ఎందుకు నేర్చుకోవాలంటే, వాళ్ళకు ఇంటరెస్ట్ ఉంటే, వాళ్ళకు అవసరమైతే నేర్చుకోవాలి. అరవ వాళ్ళెవరైనా మీ అద్దంకిలోనో, మా నరసరావు పేటలోనో సెటిలైతే, వాళ్ళకు వేరే ఆప్షన్ లేదు మరి. నేను బెంగుళురులో ఉంటాను. నాకు ఇక్కడ కన్నడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కూరల వాళ్లతో సహా అందరూ తెలుగు మాట్లాడతారు. కానీ నాకు కన్నడ అంటే ఇష్టం, ఆసక్తి. అందుకే నేర్చుకుంటున్నా కొంచెం కొంచెం!
చాగంటి సోమయాజులు గారి సాహిత్యం చదవండి. తేనె సోకగ నోరు తీయనగు రీతి అంటు మొల్ల ఎందుకు వర్ణించిందో అర్థమవుతుంది, తెలుగు భాషలోని కమ్మదనం! కుటుంబరావు గారి సాహిత్యం చదవండి, ఎంత సరళంగా ఉంటుందో తెలుగు…అర్థమవుతుంది. ఆరుద్ర గారి కథలు, ఇతరాలు చదవండి..ఎంత పదునుగా ఉంటుందో తెలుగు …అర్థమవుతుంది,
విదేశాల్లో ఉన్న తెలుగు వారైనా సరే, తెలుగును ఎందుకు మర్చిపోవాలో నాకర్థం కాలేదు. ప్రతి వీకెండూ గుడికి మాత్రం వెళతాం, మన దేవుళ్లను, మన బంధువుల్ని, మన పులిహోరను, పాఠోళీని మర్చిపోం, వదిలెయ్యం, కానీ, తెలుగు మాత్రం నేర్చుకోకపోయినా పర్వాలేదు. ఇదెక్కడి వాదం!(రాధిక గారు, మీరు తెలుగు వంటలు వండుతుంటే, ఈ పాయింట్ పనికొస్తుందేమో చూడండి)
నాకింకా ఆశ్చర్యంగా ఉంది, ‘తెలుగు ఎందుకు నేర్చుకోవాలి? ‘ అనే ప్రశ్న ఒక అచ్చ తెలుగు అబ్బాయి అడిగాడంటే! మీ ఆంధ్ర కేసరి గారు వింటే, ఏమనుకుంటారసలు?
.
సుజాత గారు,
మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు,నాకు తెలుగు రాదు/నేర్చుకోను అనటంలేదు అండి,
తెలుగులోని సంస్కృత వర్ణము,ప్రాకౄత వర్ణము,తెనుగు వర్ణము మెదలుకుని, తెలుగు సాహితీ ప్రక్రియలు వరకు తెలిసినవి కుదినవి అన్ని తెలుసుకునున్నావాడినే/నేర్చుకున్నావాడనే,మీలా తెలుగుసాహితీ అభిమానినే.
కాని “యద్యధా చరతి శ్రేష్టం” అని గీతలో చెప్పినట్టుగా…తెలుగు సాహితీ సంస్కరణకు కాలం ఆసన్నమయినప్పుడు,అది రానాప్పుడు, ఆ దారినుపయోగించువార పర/పెడ దారి పట్టుట ఉచితమే కదా. అని ఈ ప్రశ్న లేవతీశాను.
అందరు నడిచిన దారిలో వాడు సులభరీతిన గమ్యస్తానం చేరుతాడు కదా,అందుకే తెలుగు మానటంలో / ఆ స్వాదించకపోవుటలో విచిత్రములేదు.
సాంప్రదాయ ధర్మలను నవీనకరిస్తూ,మూలముచెడకుండా ఎదిగిన నాడు ఆ భాషకు అంతము తెలియదు..అది ఆగిన నాడు ఆ భాష నిలబడినా ఆదరణకునోచుకొనదు. కనుక మరుగయిన ఆ అక్షర లక్ష్మీ విలువ ఈ కాలం వారలకు, వారికి అర్దమగు అవసరమగు రీతిలో చూపించిన ఎడల వారు ఈదారిలో నడవటానికి మనస్కరిస్తారు.అప్పుడు వారిని/వారు సాంప్రదాయం వైపు నడవాలన్న/నడపాలన్న ఆశక్తి కనిపిస్తుంది.
మరి వేదకాలములో ఉన్న సాంప్రదాయలకు ఇప్పుడు ఉన్న సాంప్రదాయలకు తేడాలేదు అంటార ? కాలాను గుణంగా పాటించెడి వారలు తమ తమ సాంప్రదాయములున మారుస్తూ,కుదిరినవి మాత్రమే పాటిస్తూఉన్నారు అంటే కాదు అంటారా? లేదు కదా అంటే మార్పు ఆనంద దాయకమే కాని ఆరోగ్య కరమయిన మార్పు ఉచితము.
పాత రచనలు గొప్పవి ఏమున్నాయి(గొప్పవి మాత్రమే ఎందుకంటే సమయాభావం,పోటీ ప్రపంచంకదా..తరువాత ప్రశ్నలో ఇంకా విపులంగా వివరిస్తాను) అవి ఈ కాలానికి ఎంతవరకు అవసరమవుతాయి అని,అది చదివితే నాకు ఎంతవరకు ఉపయోగం ( అంటే, అర్ద ,జ్ఞాన ఆనంద పరంగా) అని చూసుకోనుట తప్పులేదు.తెలుగు ఎప్పటికి తగ్గిపోతుంది అని నేను అనుకోను. కాని క్రీమ్ టాలెంట్ అంటా పోతే తెలుగు అభివృద్ది జరుగదు అని మాత్రమే అంటాను. ఇప్పుడు జరిగుతుంది అదే….
దానికి సరియయిన మార్గం అన్వేషిస్తూ మెదలు పెట్టాను ఈ ప్రశ్నల పరంపర. మీ సమాధానం నాకు చాల ఉపయుక్తము…
మీ వ్యాఖ్యలో చిన్న సవరణ: మా అంద్రకేసరి కాదు , మన ఆంద్రకేసరి….. ( మీ భావం అర్ధం అయింది , ప్రకాశం జిల్లా వాడు …అని అలా చమత్కరించారు, అయినా సరే సూర్యడూ మా ఉరుపొలిమేరలో ఉదయించినంత మాత్రానా కేవలం మా ఊరి వాడా?? హ్హ్హ్జహహహ్ నేను కూడా చమత్కరించాను అనుకుటారనుకుంటూ…… )
భందువులను,దేవుళ్ళను,తెలుగు వంటలను ఎందుకు మరువము , తెలుగు మాత్రమే ఎందుకు పుల్లగా ఉంటుంది మీకు అని కదా మీ ప్రశ్న:
మీరు అడిగిన దానిలోనే దానికి సమాధానం ఉంది అండి సుజాత గారు,భందువులను చిన్నప్పటినుంచి ప్రేమ ఆప్యాయతలతో చూడాలి,వారితో ఆనందం ఉంది మన అనే భావన తలి దండ్రులు కలిగిస్తారు, మన సాంప్రదాయం ప్రకారం భందువుల ఇంటికి వెళ్ళేప్పుడు, పండో తీపి పదార్ద్దలో పట్టుకెళ్ళి చిన్న పిల్లలకు ఇస్తాం సదరుగృహస్తునకు. ఆ ఇంట్లో చిన్నపిల్లలకు ఎదన్నకొనిపిస్తాం, అమ్మకూడా భందువులువస్తే మంచి రకాల భోజనంచేస్తుంది,రోజులా ఒక కూర ఒక పప్పుతొ అవకుండా,అమ్మమ్మవయసువాళ్ళువస్తే డబ్బులుకూడా ఇస్తారు కనుక చిన్నతనంనుంచే భందువులు అంటే అదోక ఇది ఏర్పడుతుంది(ఇంకా కొన్నిఉన్నాయి రాయమంటే రాస్తాను… ).
దేవుళ్ళు … పుట్టినప్పుడు వాడి పేరు మెదలు, చనిపోయాక పూడ్చేప్పటి వరకు దేవుడు దైనందిన కార్యక్రమాలలో ఇమడ్చబడి ఉన్నాడు కనుక,(నాస్తికవాదులయినా తన పేరు నరసింహస్వామి అని ఉంటే మార్చుకుని ఏ జార్జి మైఖేల అనో,ఇంకేదో మార్చమ్నా అబ్బా ఆశ దోశ అప్పడం అంటారు…) దైవాన్ని మార్చటం కష్టం ( మార్చే వారులేక పోరులేండి… ఈ దేవుడి దగ్గర పని జరగపోతే పక్కదేవుడు,పక్క మతం దేవుడు అని పోయినవాళ్ళకూడా ఉంటారు కదా!!)…
పిండి వంటలు అమ్మ చేతి గోరుముద్దలతో మెదలయి మూడుపూటలా రకరకాల రుచులతో ఆరగించిన భోజనం మరువలేరు,మనసేకాదు శరీరంకూడా దానికి అలవాటు అవుతుంది…
కాని చిన్నప్పుడు బడికిపోయేప్పుడు,చొక్కా గుండిలు పేడూతూ అమ్మలు ఏమి చెబుతారు,బాగు చదువునాయనా బాగా పెద్ద పెద్ద ఉద్యోగాలు చెయ్యాలి, పెద్ద బాబాయిలాగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి,డబ్బు కార్లు వగయిరా వగయిరా అని ప్రతి రోజు మనసులో సూరోదయం చేయిస్తారుకదా… అక్కడ తెలుగు ఉపయొగించిన పలికించినబావం అవసరం అంతా ఇంకోదానికి (డబ్బు,అదికారం,ఇంగ్లీష్)… అది తప్పుకాదుకూడాను… ఇప్పటి మన బ్లాగరులలో కొంతమందిని చూస్తుంటే…ఆహా ఇలా చిన్నపిల్లలకు పద్యాలు నేర్పించాలి,తెలుగు మీద ఆశక్తిని పెంచాలి అని ఇప్పటినుంచి వారిని తెలుగు ప్రియులుగా చేస్తునారు అని నాకు బహుముచ్చట వేస్తుంది…ఇది లోపించ బట్టే… ఈకాలంవారికి తెలుగు నచ్చటంలేదు అని అని అనుకుంటున్నాను….
ఇది రాస్తున్నప్పుడే నాకు ఒకటీ తోచింది ఇవన్ని సమన్వయపరచేది భాషనేకదా ఇదిలేని పక్షంలో ఎలా కుదురుతుంది అని…కాని వెంటనే అనిపించింది అక్కడ భాష ఒక మీడియంమాత్రమే… మూగభాష అయినా సరేఅక్కడ పనులు జరుగుతాయి… కనుక భాష వెనుకా భావానికి పెద్ద పీట అని అర్ధం అయింది…. ఆ భావాన్ని… మనకు అవసరం అనిపించినదానికోసం ఎంతబాగ పలికిస్తామో …మన దైనందిన అవసరాలకు అది ఎంతవరకు అవసరమో దాన్నిబట్టి, మనందాన్ని(భాషకావచ్చు,పని కావచ్చు,మరేదన్నాకావచ్చు) నేర్చుకుంటాము ఆస్వాదిస్తాము అని అర్ధమయింది… మరి చెప్పండి.. ఇప్పుడు….పుల్లగా ఎందుకు అయిందో తెలిసిపోయినట్టే కదా???
చంద్రగారు,
మీ చివరి కామెంటులోనే “తెలుగెందుకు నేర్చుకోవాలి” అన్న ప్రశ్నకి జవాబుందండీ! “మన తృప్తికి, ఆనందానికి”. అంతే! చిన్నపట్నుంచీ అలాటి వాతావరణంలో పెరగకపోతే అలాంటి తృప్తి కలగడం కష్టమే. పెద్దయ్యాక “ఇది చదివితే ఆనందం వస్తుందా? ఎందుకు వస్తుంది?” అన్న ప్రశ్నలు వేసుకొని తెలుగు మీద అభిమానం పెంచుకోవడం సాధ్యమయ్యే పని కాదని నేననుకొంటాను. ఎందుకంటే ఆ ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పలేం కాబట్టి. “గోంగూర పచ్చడి” తింటే ఈ ప్రయోజనం ఉంది కాబట్టి తినండీ అని విదేశీయులకో, విదేశాల్లో పెరిగిన తెలుగువాళ్ళకో చెప్పి ఒప్పించగలమా? రుచి చూపించగలం, అంతే!
ఇక మీ రెండో ప్రశ్న “తెలుగు రావడమంటే ఏమిటి?” ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే, ఇది ఈనాటి పరిస్థితులవల్ల ఈ కాలంలోనే ఉదయించగల ప్రశ్న. ఇంతకుముందు, తెలుగు భాష తెలుగువాళ్ళ జీవితాల్లో ఒక భాగంగా ఉండేది (ఇప్పటికీ, తెలుగుదేశంలో జీవిస్తున్న కొందరికి ఇది వర్తిస్తుంది). కానీ ఈ కాలంలో చాలామందికి “భాష” కేవలం ఒక సంభాషణా మాధ్యమంగా మాత్రమే మారిపోయింది. ప్రవాసంలో ఉండేవాళ్ళకి ఆ మాధ్యమం వేరే భాష కావటంతో, తెలుగు ఎందుకు నేర్చుకోవాలి, ఎంతవరకూ నేర్చుకోవాలీ అన్న ప్రశ్నలు,సహజంగా, ఉదయిస్తున్నాయి. దీనికి మళ్ళీ నా సమాధానం ఒక్కటే, ఎవరి అభిరుచి మేరకు వాళ్ళు నేర్చుకోవచ్చు, అభిరుచి లేకపోతే మాననూ వచ్చు. తెలుగుభాష మీద అభిమానం ఉన్న వాళ్ళు, తక్కిన వాళ్ళలో ఈ అభిరుచి ఎంత ఎక్కువగా కలిగిస్తే, అంత ఎక్కువగా భాష నిలిచే అవకాశం ఉంటుంది.
@కామేశ్వరరావుగారు
సూపర్ ఉంది అండి.. …
మీరు చెప్పిన మెదటి ప్రశ్నకు సమాధానం … నాకు బాగా నచ్చింది… తెలుగు భాష నేర్చుకోవటము, నేర్చుకొనకపోవటము అనేది వ్యక్తిగతము అని నేను పూర్తిగా నమ్ముతాను. భాషాభివృద్ది అనేది.ఇలా ఎక్కువగా నమ్మేవారు ఉంటే అదే,అలవోకగా జరిగుతుంది… అని నా దృఢవిశ్వాసము… అంకూర్ లాంటీ గొప్ప్రరచయితలు కన్నడలో ఉండికూడ దాన్ని ఎవరూ కొన సాగించ లేదు అంటే …అలా నమ్మేవారు తక్కువ అయ్యారుకనుకనే…ఇంక,బలవంతంగా నేర్పించిటం తప్పా ఒప్పా అన్నది… తరువాతి ప్రశ్నలలో రాస్తాను.
రెండవ ప్రశ్నకు సమాధనం బాగుంది అని మాత్రమే చెప్పగలను…
ఎందుకంటే.. నేను ప్రశ్న ఇలా అడిగితే … “నేను తెలుగు ఎంతవరకు నేర్చుకోవాలి?” అని అడిగినట్టయితే… మీ సమాదానం సరిగ్గ సరిపోతుంది.. కాని నేను అడిగిన ప్రశ్న… “తెలుగు రావటం అంటే?” మనం ఒక మనిషిని,ఈ జీవికి తెలుగు వచ్చు అని ఎప్పుడు అంటాం … “ఈ కాలం పిల్లలు తెలుగుని మర్చి పోతున్నారు అయ్యా”… “తెలుగు గురించి తెలియదు”,” తెలుగు శూన్యం అవుతుంది” అనేవారు….చెప్పాల్సిన సమాధానం.. అంటే వారి దృష్టిలోతెలుగు రావటం అంటే ఏమిటి అని….నా ప్రశ్న….. ఇప్పుడు అర్ధం అయింది.అనుకుంటాను నా ప్రశ్న…..సమాధానంకోసం చూస్తుంటాను…
ఇక్కడ తెలుగు అని కాదు, అసలు బాదంతా మాతృబాష, బాష అంటే ఏంటి మనసులోని బావాలని వ్యక్త పరిచే మాధ్యమంద్, అది ఏ ఫ్విదమైందయినా ఎదుటి వారి అర్థం అయితే చలు, మీరు చెప్పాలనుకున్న సందేశం ం భావానికి ఎటువంటి ఆటంకం(మారకుండా) లేకుండా ఎదుటివారికి చేరినపుడు మీరు ఏ బాషలో మాట్లాడినా సరే.
ఇక మాతృ బాష విషయానికి వస్తే ఇక్క వస్తుఫువుగా తెలుగును తీసుకుందాం, తమిళం ఇంకా వేరే ఏ భాష మాట్లాడే వాడి బాధ కూడా ఇంచుమించే ఇలాగే ఉంటుంది. ఇక్కడా కథా వస్తుఫుగా నా కొడుక్నే తీసుకుందాం, వాడికి ఇప్పుడు మిల్క్ అంటే అర్థం అవుతుంది, పాలు అంటే తెలియదు…ఇక్కాడ వాడు మాతో సంభాషిస్తున్నఫుడు వాడు వాడే బాషా మాకు అర్థం అవుతుంది కాబట్టి సమస్య మాకు లేదు, వాడు ఊర్లో తాతయ్య చెల్లెలు ఆవిడ చదువుకోలేదు, ఆవిడకు తన భావం అందించలేకపోతున్నాడు, అమ్మమ్మ కం అంటాడు, అమ్మమ్మ వరకు సరే కేని కం ఏంటి.
సమయాబావం వల్ల నేను ఇంకా వివరించి రాయలేకపోతున్నాను, తెలుగు(మాతృ బాష ఆవశ్యకత ఏంతాంతే) కింది తరాలకు కూడా నీ భావాన్ని అర్థం అయ్యేలా అందించాలి అనే ఉద్దేశ్యమే. నువ్వు అమెరికాలో పుట్టినా అక్కడే పెరిగినా సరె నువ్వు ఈ దేశానికి తెలుగుగడ్డకు రావలసిన అవసరంలేకపోతే అదే నీ ప్రపంచం నీ భాష గురించి చర్చ అవసరంలేదు, ఎప్పుడైతే నువ్వు నీ పూర్వికుల షాత్రాజుపల్లికి(కరీంనగర్ లొ ఒక గ్రామం) వచ్చి ఊరి వాళ్ళతో హేయ్ డుడ్ హౌ ఆర్యూ డూయింగ్ అని అనవల్సి వచ్చినపుడు నీకు తెలుగు నేర్చుకోవలసిన ఆవశ్యకత ఉంది, నీ గర్మంలో తెలుగు పేపర్లోని వార్తలు నీ తాతయ్యకి వినిపించి రావాల్సివచ్చినపుడు నీకు తెలుగు నేర్త్చుకోవాల్సిన అవసరం ఉంది. నీ తాతకు సంబందించిన వంద ఎకరాల పొలం అమ్మడానికి పెట్టినపుడు నీకు తెలుగు రాయాడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
మీరు చెప్పినది బాగుంది, సో తరతరాలుగా చదువుకున్న కుటుంబాలు అయి ఉంటే తెలుగు నేర్చుకోవలసిన అవసరం లేదు అనేది అక్షర సత్యం అని మీరు నమ్ముతున్నారు…..
( మీర్ చెప్పిన ఉదాహరణను నేను తర్కించక భావం మాత్రమే గ్రహించి రాస్తున్నాను)
మరొక బ్లాగులో ఎవరో అన్నట్టు, నాలుగు వేమన పద్యాలు నోటికివచ్చి అర్థం చేసుకొనేంత తెలుగు మినిమం అనుకుంటాను. ఇక చదవడం రాయడం మాటకి వస్తే, కనీసం చదవడం వస్తే చాలేమో. నేను తెలుగు నా స్వహస్తాలతో రాసి ఏన్నాళ్ళయిందో (ఎన్నేళ్ళయిందో) గుర్తేలేదు! తెలుగు సాహిత్యం వగైరా అభిరుచికి సంబంధించినది, బలవంతాన రుద్దడంలో ప్రయోజనం లేదు. గుఱ్ఱాన్ని నీళ్ళ దగ్గరవరకూ తీసుకెళ్ళడం వరకే మన బాధ్యత, అది తాగుతుందీ లేనిదీ దానిష్టం!
ఇక ఆ తర్వాత మీరు చెప్పిన స్థాయిలన్నీ తెలుగు రావటం అవదు, “తెలుగు చేయటం” అవుతుంది:-)
అయినా, విదేశాల్లో పుట్టిపెరిగే తెలుగువాళ్ళకన్నా, మన ఆంధ్రదేశంలో పుట్టిపెరుగుతూ కూడా తెలుగుకి బలవంతాన దూరమయ్యేవాళ్ళ గురించే నేనెక్కువ తపన చెందేది.
హాయ్ మౌళి
‘హాయ్’ అనే పదాన్ని కుడా నాకు తెలుగు లోనె అనాలని వుంది.కాని దానికి సమానార్దం వచ్చె తెలుగు పదం నాకు తెలియదు మరి.అలా అని నాకు తెలుగు రానట్టే నా? అలా అని ఎవరన్నా అంటే నేను వాళ్ళ మూర్ఖత్వం అనుకుంటాను.
ఎందుకంటే నా జీవన పరిధి లో (నాకు తెలిసిన ఒక 400-500 మంది) చాలా మంది కన్నా నాకు ఎక్కువ తెలుసు అని నా మీద నాకు ఒక ధ్రుడమైన నమ్మకం.ఇక తెలుగు రావటం అంటె ఎమిటి అన్న విషయానికి వస్తే నెను మల్లి అదే చెబుతాను.వాడు చుసిన సమాజం,వాడు పెరిగిన పరిస్థితులు,వాడు చదువుకున్న విధానన్ని బట్టి మీరు చెప్పిన 4 రకాల వాల్లు తెలుగు వచ్చిన వాల్లె అని నా అభిప్రాయం.(కేవలం వ్యక్తిగతం).
హైదరాబాద్ జూబ్లిహిల్ల్స్ లో పుట్టి పెరిగిన వాడికి(చాలా మంది కి ) మాట్లాడటం తప్ప రాయటం రాదు.
ఎదో ఒక మారుమూల పల్లెటూల్లో పుట్టి పెరిగి సర్కారు బళ్ళో వానా కాలం చదువులు చదువుకున్న నా లాంటి వాళ్ళు కొంచెం బస్సు మీద బోర్డులు,సినిమా పేర్లు,తెలుగు పేపరు చదవగలుగుతారు.
ఇక కొద్దో గొప్పో చిన్నప్పటి నుండి సాహిత్యం తో పరిచయమున్న మీలాంటి వాళ్ళు ఆ మూడవ కోవ కి చెందుతారు.
వీళ్ళందరు తెలుగు తెలిసిన వాళ్ళే…..వాళ్ళ వాళ్ళ పరిధులలో.
ఇక ఎంత వరకు నేర్చుకోవాలి అంటే దానికి అంతేముంది చెప్పండి.లేదు కనీసం ఇంత వరకైనా వచ్చుండాలి అంటారా?దానికి ఖచ్చితం గా నేను చెప్పలేను…ఈ ప్రశ్న ని నేనె మీకు వేస్తున్నాను..
నా వరకు నాకు ఇద్దరు తెలుగు వ్యక్తులు ప్రపంచం లో ఏ మూలన కలుసుకున్నా తెలుగులో మాట్లాడుకోవాలి అని నా ఉద్దెశ్యం.కాని మన మాత్రుభూమి లోనె ఆ పరిస్థితి లేదు…ఆ ఆలోచనా విధానం మారాలి..(సినారె గారు చెప్పినట్టు మన అస్తిత్వాన్ని కొల్పెయే వ్యక్తితం కాదు అస్తిత్వాన్ని మూలాలు గా కలిగిన వ్రుక్షం లా మన వ్యక్తిత్వం ఉండాలి అని ) అది మారితే ఆ తరువాత భాషా సౌరభాల్ని నలుదెసలా వ్యాపంపజేయడానికి…మన భాష ని దినదిన ప్రవర్దమానం చేయటానికి మీలాంటి ఓత్సాహికులు చాలా మంది ఉన్నారు. మీ ప్రశ్న కు ఎంత వరకు జవాబు ఇవ్వగల్గానో తెలియదు గాని, నా పరిధి మేరకు చెప్పాను.
@కామేశ్వరరావుగారు @ శ్రీకాంత్
మీసమాధాలకు నెనర్లు,
ఈ వ్యాఖ్యలు నేను సేకరించిన సమాచారం అంతాకలిపి మరొక టపా రాస్తున్నాను…దాన్నికూడా పరికించగలరు…