మునులందరు మీరు పరమ మంచోళ్ళవుదురు గాక అని శపించరెందుకు….?
రామాయణ,భారత,భాగవతాదులు మొదలు వేదాలు,పురాణాల వరకు ఏ హైందవ వాజ్ఞయం తీసుకున్నా శపించటం,వరాలు కురిపించటం అనేది అత్యంత ముఖ్యమయిన అంశం. వశిష్టుడు,అగశ్త్యుడు, విశ్వామిత్రుడు వంటి అత్యంత ప్రభావిత గురువులు మెదలు బ్రహ్మ,విష్టు, మహేశ్వరుల వరకు ఎదోక సంధర్బంలో శపించన వారే. భక్తి ప్రపత్తులు,కధాగమనం,కధాసారాంశాల దృష్ట్య కాకుండా, లాభనష్టాల పరంగా ఆలోచిస్తే నాకు ఉదయించిన ప్రశ్న ” శాపించేప్పుడు ఎప్పుడూ తప్పుడు వెధవాయి లయిపోండి” అని మాత్రమే శపిస్తారు అని.
ఉదాహరణకు: రామాయణంలో కభంధుడినే తీసుకుందాం, గంధర్వుడు, సూర్యసమాన తేజో వంతుడయిన దనువు, తన భుద్దియందు వైక్లభ్యం చేత వికృత రూపము దాల్చి, అడవిలో ప్రవేశించి(నగరంలో కాదు) అందరినీ భయచిత్తులను చేస్తూ ఆనందించే వాడు,అలా ఒకానొక రోజు స్తూల శూరుడనే ముని చేత శపించబడతాడు. అలా శపించబడిన ధనువు ఆ ముని పాదముల పైబడి పరిహారం కోరతాడు. రామలక్ష్మణ్లు చేత సంహరింప బడిన నాడు, తిరిగి ధనువుగా పూర్వరూపం పొందుతావని అక్కడనుంచి వెళ్ళిపోతాడు. ధనువు బ్రహ్మగూర్చి ఘోరతపస్సు చేసి, ధీర్ఘాయుర్దాయం సిద్ధించుకుంటాడు(గంధర్వుడు కనుక అడగ్గానే అంత అమూల్యమయిన వరం వచ్చి ఉంటుందేమో, మానవులకు ఆ వరం ఇవ్వబడదు కదా…). ఆ వరగర్వంతో ఇంద్రుని మీద యుద్దానికి పోయి తల కాళ్ళు పోగొట్టుకుంటాడు. భ్రహ్మ వరాన్ని గుర్తుంచుకుని, ఇంద్రుడు రెండు యోజనాల చేతులు ఒక నోరు ఇస్తాడు బోజన సదుపాయం కోసం.(తెలుగు నుడికారంలో వాడ బడే “కబంధ హస్తాలు” అన్న పదం – ఈ కధనుంచి వచ్చినదే). అలా వికృత రూపిగా మారి. ఆ ప్రాంతాన్ని చిన్నాభిన్నం చేస్తూ… చివరికి రామునిచే విగతుడవుతాడు.(వాల్మీకి రామాయణం అరణ్యకాండ నుంచి).
పై కధను, ప్రస్తుత కాలమానం ప్రకారం మార్చి తీసుకుంటే: తెలివయిన, అందమయిన వారు అయి ఉండి,గొప్ప కుటుంబం నుంచి వచ్చామన్న మదప్రభావంతో వెధవ పనులు చేసే వారందరూ ఈ ధనువు వారసులనచ్చు. వారికి మానవులు విధించే శిక్ష కారాగారం, శృతిమించితే పిచ్చి ఆసుపత్రిలో చేర్పించి వారికున్న ఆ భావాన్ని తమ మెదడునుంచి బయటకు తోసేసి మళ్ళీ మనుషులుగా మార్చాలని ప్రయత్నం. లేక తలిదండ్రులు భాధ్యత గుర్తెరిగిన వారయితే ..పిల్లవాడిని/సదరు వ్యక్తిని సైక్యర్టిష్ట్కు చూపించి వారికి ఉన్న పిచ్చిని నయం చేయింటమో చేసి చివరికి మళ్ళీ మంచి వారిని చేస్తారు.
కాని అక్కడ ముని చేసినట్టు చేస్తే… ఇంకా నిత్య దరిదృడివి అయిపో, ఇంకా నికృష్టుడివి అయిపో అంటే… వాడు సంచరించే ప్రాంతంలో వున్నవారందరూ భాదించబడుతారు దాని వల్లా వాడి ఖాతాలో మరింత పాపం పేరుకు పోవటానికి ప్రేరేపించిన వాడిని అవుతున్నాను. అని మునులు ఎందుకు ఆలోచించరు…? కధాపరంగా కభందుడీ అవసరం రామయణానికి లేదు, స్తూల శూరుడనే ఒక కారెక్టర్ దండగ తప్ప(సినిమా వాళ్ళ దృష్ట్యా) ఈ కభందుడు అలియాస్ ధనువును నీ భుద్ది మంచిగా మారుగాక అని శపిస్తే ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి…
అలాగే విశ్వామిత్రుడు శాపాల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే….విశ్వామిత్రుడు సైక్యార్టిష్టు కేసులన్నీ క్రిమినల్ కేసులుగా మార్చాటానికి వారి మంత్ర ప్రబావాన్ని ఖర్చు చేసుకున్నారు ఎందుకు….?
ఇక పోతే సనకసనందనాదులునే తీసుకుందాం, జయ విజయులు పాపం వారి ధర్మం వారు చేస్తున్నారు. శపించి పారేశే, ఎవరు భాదపడింది, రెండు యుగాలు పాటు మనుషులు దారుణమయిన జీవనం గడిపారు(రావణ కుంభకర్ణులచే,కంసునిచే,హిరణ్యాక్షుడు,హిరణ్యకశిపుడు, వగైరా …వగైరా… ). అదేందో… నువ్వూ మంచివాడి వయి ధర్మజీవనం గడూపుతూ భూమి మీద జన్మించు అని శాపం ఇచ్చారు అనుకో …..దర్మాతులయి జీవితాలు ఎంత దయనీయంగా, కష్టతరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాలా ….. హరిశ్చంద్రుడు ఉదాహరణ ఉండనే ఉంది కదా….. నిజంగ…. పాపానికి పరిహారంగా శాపం విధించాలి అంటే… ధర్మాత్ములయిపోదురు అని శపిస్తే …వాడి తిక్క ఆణిగి తిమ్మిరెక్కుతుంది కదా మరి….. ఎమంటారు …??????
(ఇంకా ఉంది)
ఇప్పటికి 10 వ్యాఖ్యలు
Leave a reply
shapimchEdi kOpamutO.
mamchOllu ai povaalanedi anugraham to.
pratidaaniki venuka kaarayaakaarana sambamdham vumtumdi. vaallaa aaveshamu venukakoodaa edo kaaranam vumdi teerutumdi.
mamchi maargam ennukunnaavu subhamastu
Interesting. చాలా ఒరిజినల్ ప్రశ్న. ఎవరేమంటారో చూద్దాం.
మనుషులు తమకున్న అవలక్షణాలన్నీ దేవుళ్ళకు అంటగడతారు.అలాగే మునులకూ,తపస్వులకూనూ! అయినా,తపస్సుద్వారా స్థితప్రజ్ఞులైన వీళ్ళకూ ఈ కోపతాపాల్ని అంటగట్టి “కథగడుపుకోవడమే”తప్ప మరొ ఉద్దేశం ఉందంటారా?
ఇలా అడిగితే రసపట్టులో తర్కం కూడదంటారు. కథాగమనానికి కావలసిన ట్విస్టులన్నమాట ఈ కోపతాపాలూ,వర-శాపాలు. అంతే!
అసలు సర్వ సంగ పరిత్యాగులు, అరిషడ్వర్గాన్ని జయించాము అని బోర్డు పెట్టుకు కూర్చున్న మునులకు, కోపం ఎందుకు వస్తుంది? శాపాలు ఎందుకిస్తారు? అది తేల్చాలి ముందు.
మంచి ప్రశ్న. ఇటువంటిదే మరో ప్రశ్న నన్ను తొలిచేస్తుంది. దేవుడు మనల్నందర్నీ మంచివారిగా ఎందుకు పుట్టించలేదు? ఈ ఉత్పాతాలూ , ఉప్పెనలెందుకు సృష్టించాడు?
కానీ ఒక్కోసారి మరో విధంగా అలోచిస్తే, దీనికేదో బలమైన కారణమే వుండవచ్చనిపిస్తోంది. ఉదాహరణకు మనదరం మంచివారనుకుందాం. ఈ ప్రపంచం ఇంత అందంగానే, ఇంతే ఉత్సుకతతోనే వుంటుందా?
మరో కోణంలో, మానవులకు మల్లే దేవుడికి కూడా కొన్ని పరిమితులు వుంటాయేమో? అసలు సృష్టిలోని ప్రతి శక్తికీ ఎదో ఒక పరిమితి వుంటుంది. కానీ ఆ పరిమితులలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినవారిని దేవుళ్ళుగా(ఆదర్శప్రాయులుగా) ప్రతిష్టించారేమో?
అంతా ఆ పరమాత్ముడికే ఎరుక(?)..
ఎందుకంటె వరానికి శాపానికి అర్దాలు ఆ కాలం కి ఈకాలం కి తారుమారు ఐనట్లు ఉన్నాయ్ అందుకు !
పైన దుర్గేశ్వరగారు చెప్పినట్లు శపించటమనేది కోపంతో చేసే పని కాబట్టి చెడు జరగాలనే ఉంటుంది. కానీ శాపం పక్కన పెడితే, అంత తపశ్శాలులు తమ తపశక్తితో ప్రపంచాన్ని, మనుషుల్ని మెరుగ్గా మార్చొచ్చు కదా అనే అనుమానం నాకూ ఇంతక ముందు వచ్చింది. నాకనిపించేదేమిటంటే, శపించటం అనేది ఒకరకమైన అధికారాన్ని ఉపయోగించి అవతలివారిని శిక్షించటం. అధికారంతో శిక్షించగలమేగాని, వారిని మంచిగా మార్చెయ్యలేము. ఏ విధమైన అధికారాలతోనూ ఎవరిలోకి మంచి చొప్పించలేము కదా.
@pedarayudu gaaru: I liked your view.
నా ఉద్దేశ్యం కూడా అదే.. మునులు కోపంతో శాపాలు ఇవ్వబోయి వరాలు ఇచార…..ఏమి …అని. ఇప్పుడు రావణుడినే తీసుకుందాం …. శాపం వల్ల అలా అయిపోయాడు అనుకుందాం… కాని జీవాతాంతం … పిచ్చపిచ్చగా ఆనందించాడు కదా (తన వరకు).. ఎదో చివరలో రామయ్య ఒక మూడు నెలలు కశ్తపెట్టదు అనుకుందాం …..
ఆది అయితే నాకు వరంలా కనిపిస్తుంది …. కశ్తాలు పడ్డ దాఖలాలు ఎవి ….?
అదే హరిస్చంద్రుని తీసుకోండి…. దేవతల సరదాకి(టెష్ట్ కి) బలి అయిపోయడే …. కష్టాలు అంటే కనీసం అలా ఉండాలి కదా …
పురాణాల్ని తరచి చూస్తే, ప్రతి శాపానికీ ఏదో ఒక ప్రయోజనం మరోచోట ఉండనే ఉంటుంది. కాబట్టి శాపం అన్నది మరో కార్యం జరిపింపచేసే ఉత్ప్రేరకం. అలా అర్ధం చేసుకోవటమే